Wrestler Murder Case: బట్టలు, సెల్ఫోన్ని అక్కడ దాచిన సుశీల్ కుమార్
https://ift.tt/3i5zgOa యువ రెజ్లర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్పై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సుశీల్ కుమార్ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా హరిద్వార్కి తరలించారు. మే 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో సుశీల్ కుమార్ తన గ్యాంగ్తో కలిసి యువ రెజ్లర్ సాగర్ (23), అతని స్నేహితుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. సాగర్పై దాడి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సుశీల్ కుమార్ 22 రోజుల తర్వాత పోలీసులకి చిక్కాడు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే సుశీల్ కుమార్తో క్రైమ్ సీన్ కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న సమయంలో సుశీల్కి సాయం చేసిన వారిని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు సుశీల్ కొన్ని రోజులు హరిద్వార్లో ఉన్నట్లు గుర్తించి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. సాగర్పై దాడి తర్వాత హరిద్వార్ వెళ్లిపోయిన సుశీల్ కుమార్.. అతను ఆసుపత్రిలోనే కన్నుమూయడంతో.. దాడి సమయంలో తాను ధరించిన బట్టలు, వాడిన సెల్ఫోన్ని హరిద్వార్లోనే పాతిపెట్టినట్లు విచా...