Posts

Showing posts from May, 2021

Wrestler Murder Case: బట్టలు, సెల్‌ఫోన్‌ని అక్కడ దాచిన సుశీల్ కుమార్

Image
https://ift.tt/3i5zgOa యువ రెజ్లర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సుశీల్ కుమార్‌ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా హరిద్వార్‌కి తరలించారు. మే 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో సుశీల్ కుమార్ తన గ్యాంగ్‌తో కలిసి యువ రెజ్లర్ సాగర్ (23), అతని స్నేహితుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. సాగర్‌పై దాడి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సుశీల్ కుమార్ 22 రోజుల తర్వాత పోలీసులకి చిక్కాడు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే సుశీల్‌ కుమార్‌తో క్రైమ్ సీన్‌ కన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న సమయంలో సుశీల్‌కి సాయం చేసిన వారిని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు సుశీల్ కొన్ని రోజులు హరిద్వార్‌లో ఉన్నట్లు గుర్తించి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. సాగర్‌పై దాడి తర్వాత హరిద్వార్ వెళ్లిపోయిన సుశీల్ కుమార్.. అతను ఆసుపత్రిలోనే కన్నుమూయడంతో.. దాడి సమయంలో తాను ధరించిన బట్టలు, వాడిన సెల్‌ఫోన్‌ని హరిద్వార్‌లోనే పాతిపెట్టినట్లు విచా...

Sushil Kumar పాశవిక దాడి వీడియో వెలుగులోకి.. రెజ్లర్‌పై హాకీ స్టిక్‌తో

Image
https://ift.tt/3frsuR3 భారత సీనియర్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో యువ రెజ్లర్ సాగర్‌పై సుశీల్ కుమార్ తన సహాయకులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. హాకీ, బేస్‌ బాల్ స్టిక్స్‌‌తో సాగర్‌ అతని స్నేహితుడిని సుశీల్ కుమార్‌ విచక్షణారహితంగా కొట్టడంతో.. తీవ్రంగా గాయపడిన సాగర్.. ఆసుపత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచాడు. దాంతో.. 20 రోజులు పరారీలో ఉన్న సుశీల్ కుమార్ గత ఆదివారం మీరట్‌లో ఢిల్లీ పోలీసులకి చిక్కాడు. ఆ తర్వాత మూడు రోజులకే అతని నలుగురు సహాయకులు కూడా పోలీసులకి చిక్కారు. సుశీల్ కుమార్‌ని కోర్టులో ప్రవేశపెట్టగా.. అతనికి ఆరు రోజుల రిమాండ్ విధించారు. దాంతో.. సుశీల్‌ని ఛత్రశాల స్టేడియానికి తీసుకెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ క్రమంలో సుశీల్ కుమార్ స్టేడియంలోని సీసీ టీవీ పుటేజీలను డిలీట్ చేయించినట్లు గుర్తించారు. అలానే దాడిని తన స్నేహితుడితో వీడియో తీయించడం ద్వారా.. రెజ్లింగ్ వర్గాల్లో తనంటే భయాందోళనలు కలిగించాలని సుశీల్ ఆశించినట్లు విచారణలో తేలింది. ఇక సుశీల్ సహాయకుల విచారణ ద్వారా.. అతనికి ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లతో సంబంధాల...

Wrestler Murder Case ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులకి సహకరించిన రెజ్లర్ సుశీల్ కుమార్

Image
https://ift.tt/3hSnaIh భారత సీనియర్ రెజ్లర్ పొంతలేని సమాధానాలతో ఢిల్లీ పోలీసులకి ఇన్వెస్టిగేషన్‌లో చికాకు తెప్పిస్తున్నాడట. జూన్ 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో సుశీల్ కుమార్, అతని స్నేహితులు 23 ఏళ్ల రెజ్లర్ సాగర్‌పై దాడి చేయగా.. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. దాంతో.. దాదాపు 20 రోజులు పోలీసులకి చిక్కకుండా తప్పించుకున్న సుశీల్ కుమార్.. గత ఆదివారం మీరట్‌లో అరెస్టయ్యాడు. దాంతో.. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆరో రోజుల రిమాండ్ విధించారు. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఇప్పటికే క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. దాడి జరిగిన తీరుపై పూర్తి అవగాహనకి వచ్చారు. అయితే.. సాగర్‌పై ఎందుకు దాడి చేశావు..? పారిపోయేందుకు ఎవరు సహకరించారు..? గ్యాంగ్‌స్టర్లు కాలా, నీరజ్‌తో నీకు ఉన్న సంబంధాలేంటి..? తదితర ప్రశ్నలకి సుశీల్ కుమార్ పొంతలేని సమాధానాలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని ఆధారంగా చేసుకుని మరిన్ని ప్రశ్నలు వేయాలని ప్రయత్నిస్తుంటే రెజ్లర్ మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్‌పై దాడిలో సుశీల్ కుమార్‌కి సహకరించిన అతని నలుగురు సహాయకుల్ని కూడా పోలీసులు తాజ...

Sushil Kumarతో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

Image
https://ift.tt/3vlTXcw యువ రెజ్లర్ మర్డర్ కేసులో అరెస్టయిన భారత సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌‌‌తో పోలీసులు క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో 23 ఏళ్ల సాగర్‌పై తన స్నేహితులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో.. తీవ్రంగా గాయపడిన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆ వెంటనే సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం దాదాపు రెండు వారాలకి పైగా గాలించిన పోలీసులు ఎట్టకేలకి మీరట్‌లో గత ఆదివారం అరెస్ట్ చేశారు. సుశీల్ కుమార్‌ని కోర్టులో పోలీసులు హాజరుపరచగా.. అతనికి ఆరు రోజుల రిమాండ్ పడింది. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న సుశీల్ కుమార్‌‌ని సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జైల్లో అతను నేలపైనే పడుకున్నాడని.. ఖైదీలు తినే భోజనాన్ని అతనూ తిన్నాడని తెలిసింది. మంగళవారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుశీల్ కుమార్‌ని ఛత్రశాల స్టేడియానికి తీసుకెళ్లారు. అక్కడ నేరం జరిగిన తీరుని రీకన్‌స్ట్రక్ చేసిన పోలీసులు.. సాగర్‌పై దాడి చేసిన తర్వాత ఛత్రశాల స్టేడియంలోని...

వీడియోతో అడ్డంగా బుక్కయిన రెజ్లర్ సుశీల్ కుమార్.. మర్డర్ కేసులో ట్విస్ట్

Image
https://ift.tt/3hNREej భారత సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్ మర్డర్ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయాడు. యువ రెజ్లర్ సాగర్ రాణా (23) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్.. రెండు వారాల తర్వాత పోలీసులకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టులో అతడ్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడించారు. సాగర్ రాణా తనని అందరి ముందు అవమానపరచడంతో పగతో రగిలిపోయిన సుశీల్ కుమార్.. విచక్షణారహితంగా సాగర్ రాణా, అతని స్నేహితుడు సోనుపై దాడి చేసినట్లు వీడియో సాక్ష్యాన్ని పోలీసులు కోర్టుకి అందజేశారు. రెజ్లింగ్ వర్గాల్ని భయపెట్టడానికి సుశీల్ కుమార్.. తన స్నేహితుడు ప్రిన్స్‌ని ఆ దాడి వీడియోని తీయనమి కోరినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు మర్డర్ కేసులో ఆ వీడియో సాక్ష్యం కీలకంగా మారింది. అసలు ఏం జరిగిందంటే..? సుశీల్ కుమార్ ఇంట్లోనే అద్దెకి ఉన్న సాగర్‌.. అద్దె విషయమై అతనితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఛత్రశాల స్టేడియంలో సుశీల్ కుమార్‌ని అవమానించేలా సాగర్ మాట్లాడటంతో.. సుశీల్ కుమార్ తట్టుకోలేకపోయాడు. దాంతో.. తన స్నేహితులతో కలిసి సాగర్‌‌పై స్టేడియం పరిసరాల్లోనే దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన...

రెండు వారాలు పోలీసులకు చుక్కలు.. ఎట్టకేలకు చిక్కిన రెజ్లర్ సుశీల్ కుమార్

Image
https://ift.tt/3fDaPoH హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న స్టార్ .. ఎట్టకేలకు పట్టుబడ్డాడు. గత 15 రోజులుగా అతడి గురించి తీవ్రంగా గాలించిన .. లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. సుశీల్ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష నగదు రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. అతడి కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఎట్టకేలకు పంజాబ్‌లో చిక్కారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వెళుతుండగా ఓ టోల్ గేట్ వద్ద సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పంజాబ్‌లోని సుశీల్ స్నేహితుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని గాలింపు చేపట్టడంతో చివరకు పట్టుబడ్డారు. సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిని ఢిల్లీకి తరలిస్తున్నారు. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ఖర్ హత్య కేసులో సుశీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ధన్ఖర్‌పై దాడి చేసి అతడి మృతికి కారకుడయ్యాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్ మృతి చెందినప్పటి నుంచి సుశీల్ కుమార్ పరారీలోనే ఉన్నారు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేసి.. సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపితే రూ.1 లక్ష రివార్డు ఇస్తామని ప్రకటించారు. సుశీల్ కుమార్ కారులో వెళుతుండగా ...

Sushil Kumar కెమెరాకి చిక్కి.. మళ్లీ అజ్ఞాతంలోకి రెజ్లర్

Image
https://ift.tt/3ufRVcR మర్డర్ కేసులో ఇరుక్కున్న భారత సీనియర్ రెజ్లర్ ఆచూకీ ఎట్టకేలకి ఢిల్లీ పోలీసులకి లభించింది. ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో ఈ నెల 4న యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్.. ఆ ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాంతో.. అతని కోసం గత రెండు వారాలుగా గాలిస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఫస్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం అతనిపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అవగా.. ఆఖరిగా ఢిల్లీ పోలీసులు సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డ్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఢిల్లీ పోలీసుల గాలింపు తీవ్రతరం కావడంతో.. అరెస్ట్ తప్పదని భావించిన సుశీల్ కుమార్.. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించాడు. సుశీల్‌ని ఉద్దేశపూర్వకంగానే కొంత మంది ఈ కేసులో ఇరికించారని అతని తరఫు న్యాయవాది వాదించాడు. అయితే.. ప్రభుత్వ తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ హాకీ స్టిక్‌తో సాగర్ దండక్‌ని గాయపరిచనట్లు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకి విన్నవించాడు. దాంతో.. సుశీల్‌కి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సుశీల్ కుమార్ కోసం గాలిస్తున్న పోలీసులకి ఎట్టకేలకి...

మిల్ఖా సింగ్‌కు కరోనా పాజిటివ్.. జాగింగ్ నుంచి తిరిగొచ్చాక..?

Image
https://ift.tt/3v6oY42 అథ్లెటిక్స్ లెజెండ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు బుధవారం సాయంత్రం కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఛండీ‌గఢ్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మిల్ఖా సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన భార్య నిర్మల్ కౌర్ తెలిపారు. మిల్ఖా సింగ్ ఇంట్లో పని చేసే ఒకరికి కొద్ది రోజుల క్రితం కరోనా సోకినట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు టెస్టులు చేయించుకున్నారు. మిల్ఖా సింగ్‌కు హై ఫీవర్ వచ్చిందని.. కానీ టేస్ట్, స్మెల్ తెలుస్తున్నాయని ఆయన భార్య తెలిపారు. ‘‘నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. బుధవారం రోజు జాగింగ్ నుంచి తిరిగొచ్చాక నాకు పాజిటివ్ అనే రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయాను. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’’అని 91 ఏళ్ల ఏళ్ల మిల్ఖా సింగ్ తెలిపారు. మిల్ఖా సింగ్, ఆయన కుమారుడు, గోల్ఫర్ అయిన జీవ్ మిల్ఖా సింగ్ కరోనాపై పోరు కోసం రూ.2 లక్షల విరాళమిచ్చాడు. ది ఫ్లైయింగ్ సిఖ్‌గా గుర్తింపు పొందిన మిల్ఖా సింగ్.. ఎన్నో చిరస్మరణీయ రేసుల్లో పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మిల్ఖా సింగ్ గుర్తింపు పొందారు. 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్ఖా సింగ...

రెజ్లర్ సుశీల్‌ కుమార్‌కి ముందస్తు బెయిల్ నిరాకరణ.. అరెస్ట్ తప్పదా..?

Image
https://ift.tt/2S1HADM భారత సీనియర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో ఈ నెల 4న యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య జరిగింది. సుశీల్ కుమార్ హాకీ స్టిక్‌తో దాడి చేయడంతో గాయపడిన సాగర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో.. సుశీల్ కుమార్‌తో పాటు అతని స్నేహితులపైనా కేసు నమోదు చేసిన పోలీసులు.. గత రెండు వారాల నుంచి అతని కోసం వెతుకుతున్నారు. దాంతో.. అరెస్ట్ తప్పదని భావించిన సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీలోని రోహిణి కోర్టులో పిటీషన్ వేశాడు. కానీ.. బెయిల్ ఇచ్చేందుకు కోర్డు నిరాకరించింది. రెజ్లర్ సాగర్ దండక్‌ని గాయపరిచిన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం గాలించిన పోలీసులు దొరక్కపోవడంతో.. ఫస్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కానీ.. సుశీల్ మాత్రం అజ్ఞాతం వీడలేదు. దాంతో.. ఆఖరిగా సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్‌ కోసం పిటీషన్ వేశాడు. కానీ.. కో...

మర్డర్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన రెజ్లర్ సుశీల్ కుమార్

Image
https://ift.tt/3oyf3C4 ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత రెజ్లర్‌గా కొనసాగుతున్న సుశీల్ కుమార్.. ముందస్తు బెయిల్‌ కోసం మంగళవారం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో జరిగిన గొడవలో యువ రెజ్లర్ సాగర్ దండక్ మృతి చెందాడు. మోడల్ టౌన్ ఏరియాలోని ఓ ప్లాట్ విషయమై ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో.. సాగర్ దండక్‌, అతని మిత్రులపై , అతని టీమ్ స్టేడియం ఆవరణంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దాంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాగర్ చనిపోయాడు. సాగర్ దండక్ మృతితో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆ రోజు నుంచి సుశీల్ కుమార్, అతని టీమ్‌ కోసం వెతుకుతున్నారు. కానీ.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రెజ్లర్.. పోలీసులకి దొరకలేదు. దాంతో.. ఫస్ట్ లుకౌట్ నోటీసులు.. ఆ తర్వాత సుశీల్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ని జారీ చేశారు. అయినప్పటికీ సుశీల్ కుమార్ అజ్ఞాతం వీడలేదు. దాంతో.. ఆఖరికి సుశీల్ ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డ్ ఇవ్వబోతున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో.. సుశీల్ కుమార్ మంగళవారం తనకి ముందస్తు బెయిల్ మంజార...

Wrestler Sushil Kumar ఆచూకీ చెబితే రూ. 1 లక్ష రివార్డ్.. మరో ఆఫర్ కూడా

Image
https://ift.tt/2Rio0TV భారత సీనియర్ రెజ్లర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో జరిగిన గొడవలో రెజ్లర్ సాగర్ దండక్ మృతి చెందాడు. సాగర్‌ అతని మిత్రులపై సుశీల్ కుమార్ టీమ్ హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ దాడిలో సాగర్ తలకి తీవ్ర గాయమవగా.. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో.. సుశీల్ కుమార్‌పై మర్డర్ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సాగర్ మృతి చెందిన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో గాలించిన పోలీసులు.. ఫస్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దాంతో.. గత వారం ఢిల్లీ కోర్డు అతనిపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కానీ.. సుశీల్ కుమార్ గురించి సమాచారం మాత్రం తెలియరాలేదు. ఇక ఆఖరి అస్త్రంగా ఢిల్లీ పోలీసులు రివార్డ్ ప్రకటించారు. సుశీల్ కుమార్ ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అతనితో పాటు ఈ కేసులో ఉన్న అసోషియేట్ అజయ్ గురించి సమాచారం ఇచ్చినా రూ.50,000 రివార్డ్ ఇవ్వబోతున్నట్లు ప...

Singapore Open రద్దు.. సైనా నెహ్వాల్, శ్రీకాంత్ ఒలింపిక్ ఆశలకి తెర

Image
https://ift.tt/3fiijgs భారత అగ్రశ్రేణి షట్లర్లు , కిదాంబి శ్రీకాంత్‌‌లకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించేందుకు ఆఖరి అవకాశంగా కనిపించిన సింగపూర్ ఓపెన్ కరోనా కారణంగా తాజాగా రద్దయింది. వాస్తవానికి ఈ టోర్నీని వాయిదా వేస్తారని అంతా ఊహించారు. కానీ.. సింగపూర్ ఓపెన్ కోసం కొత్త తేదీల్ని ప్రకటించేది లేదని బీడబ్ల్యూఎఫ్ స్పష్టంగా ప్రకటించేసింది. దాంతో.. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలకి గండిపడింది. భారత్ నుంచి ఇప్పటి వరకు పీవీ సింధు, సాయి ప్రణీత్, చిరాగ్ శెట్టి- సాత్విక్ మాత్రమే ఒలింపిక్స్ అర్హత సాధించారు. జూన్ 1 నుంచి 6 వరకూ సింగపూర్ ఓపెన్ జరగాల్సి ఉండగా.. కరోనా తీవ్రత పెరగడంతో టోర్నీని రద్దు చేయక తప్పలేదు. క్రీడాకారులకి సురక్షిత వాతావరణం కల్పించడం కోసమే ఇలా రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ చెప్పుకొచ్చింది. వాస్తవానికి భారత్ వేదికగా జరగాల్సిన ఇండియా ఓపెన్ రద్దయినప్పుడే సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు సన్నగిల్లాయి. అయినప్పటికీ.. సింగపూర్ ఓపెన్‌లో సత్తాచాటడం ద్వారా మెగా టోర్నీకి అర్హత సాధించాలని ఇద్దరూ ఆశించారు. కానీ.. మొండిచేయి ఎదురైంది. వాస్తవానికి...

రెజ్లర్ సుశీల్ కుమార్‌పై లుకౌట్ నోటీసులు.. మర్డర్ కేసు

Image
https://ift.tt/3hgxSI9 భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌పై ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో జరిగిన గొడవలో రెజ్లర్ సాగర్ దండక్ మృతి చెందాడు. సాగర్‌ అతని మిత్రులపై టీమ్ హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ దాడిలో సాగర్ తలకి తీవ్ర గాయమవగా.. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో.. సుశీల్ కుమార్‌పై మర్డర్ కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. అతని కోసం గాలించారు. సాగర్ మృతి చెందిన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం ఐదు రోజుల పాటు ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో గాలించిన పోలీసులు.. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి సుశీల్ కుమార్‌తో సాగర్‌కి మంచి సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సుశీల్ ఇంట్లోనే అద్దెకి ఉన్న సాగర్.. ఇటీవల ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అద్దె విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగి.. అది హత్యకి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. సుశీల్ కుమార్ మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య సీరియస్‌గా స్పందించింది. గతంలో రెజ్లర్లంటే గూండాలనే వారని చె...

భారత హాకీ దిగ్గజం మృతి.. కరోనా నుంచి కోలుకున్న గంటల్లోనే

Image
https://ift.tt/3h8Wq5N భారత హాకీ దిగ్గజం (62) శనివారం మృతి చెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ జట్టు బంగారు పతకం గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన రవీంద్ర పాల్ సింగ్ ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డాడు. దాంతో.. లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన అతని కుటుంబ సభ్యులు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం వివేకానంద పోలీక్లినిక్‌‌లో చేర్చారు. అయితే.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రవీంద్ర.. బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో ఈరోజు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1979లో ఇంటర్నేషనల్ కెరీర్‌ని ప్రారంభించిన రవీంద్ర పాల్ సింగ్.. భారత జూనియర్ జట్టుకి వరల్డ్‌కప్‌లో ఆడి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 1980 మాస్కో ఒలింపిక్స్, 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఆడిన రవీంద్ర.. ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లలో భారత్‌కి ప్రాతినిథ్యం వహించాడు. కరాచీ వేదికగా 1980, 1983లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రవీంద్ర.. సిల్వల్ జూబ్లీ 10- నేషన్ కప్‌లోనూ ఆడాడు. అలానే 1982లో వరల్డ్‌కప్, 1982లోనే ఆసియా కప్‌లో భారత్‌కి ప్రాతినిథ్యం వహించాడు. రవీంద్ర పాల్ సింగ్ పెళ్లి చేసుకోలేదు. అతని చెల్లి కుటుంబంతోనే కలిసి ఉన్నాడు. వాస్తవానికి రవీం...

మర్డర్ కేసులో ఇరుక్కున్న రెజ్లర్ సుశీల్ కుమార్.. పోలీసుల గాలింపు

Image
https://ift.tt/3h8x9sI ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత మెడల్స్ గెలిచిన ఏకైక భారత అథ్లెట్‌గా ఉన్న రెజ్లర్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియంలో తాజాగా రెజ్లర్ల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘర్షణ సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. అతను మిగిలిన రెజ్లర్లని ఘర్షణకి పురిగొల్పినట్లు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే.. సుశీల్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఛత్రపాల్ స్టేడియంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకి ఫస్ట్ సమాచారం అందింది. దాంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లగా.. అక్కడ స్టేడియం పరిసరాల్లో ఐదు కార్లు పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. వాటిని పరిశీలించగా.. అందులో ఒక డబుల్ బారెల్ లోడెడ్ గన్, స్కార్పియోలో గొడవకి వినియోగించే రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. ఐదు వాహనాల్ని సీజ్ చేసి.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘స్టేడియంలోకి బాధితుల్ని రెజర్లు బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడే పార్కింగ్ ఏరియాలో గొడవ జరిగింది. ఘటన జరిగిన సమయంలో రెజ్లర...

భారత క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రెండు వారాల్లోనే అమ్మ, అక్క మృతి

Image
https://ift.tt/3vPVY0G భారత మహిళా క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే వేద కృష్ణమూర్తి అమ్మ, అక్క కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. కర్ణాటకలోని కాడూర్‌లో వేద కృష్ణమూర్తి కుటుంబం నివాసం ఉంటుండగా.. గత నెల చివర్లో ఆమె తల్లి, అక్కతో పాటు సోదరుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే.. వేద కృష్ణమూర్తికి మాత్రం నెగటివ్ రావడంతో.. ఆమె వెంటనే బెంగళూరుకి వెళ్లిపోయింది. వేద కృష్ణమూర్తి తల్లి చిక్‌మగళూరులోని ఆసుపత్రిలో కరోనాకి చికిత్స పొందుతూ గత నెల 23న మృతి చెందారు. సోదరి వాత్సల శివకుమార్ కూడా చికిత్స పొందుతుండగా.. ఆమెకి ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది. దాంతో.. గత నెల చివరి నుంచి ఆమెని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. కోలుకుంటున్నట్లు కనిపించిన ఆమె బుధవారం రాత్రి మృతి చెందింది. దాంతో.. రెండు వారాల వ్యవధిలోనే అమ్మ, అక్కని కోల్పోయిన వేద కృష్ణమూర్తి తీవ్ర భావోద్వేగానికి గురైంది. అక్క మృతిపై వేద కృష్ణమూర్తి స్పందిస్తూ ‘‘అక్కకి వీడ్కోలు చెప్పాల్సి రావడం చాలా బాధించింది. రెండు వారాల్లో నా ప్రపంచం ఓ పెద్ద కుదుపునకి లోనైంది’’ అని చెప్పుకొచ్చింది. ...

బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణెకి కరోనా పాజిటివ్

Image
https://ift.tt/2RoEadM భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె(65)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. 1980లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌ గెలిచిన తొలి భారత షట్లర్‌గా నిలిచిన .. భారత్‌కి చాలా టోర్నీల్లో పతకాల్ని అందించాడు. రిటైర్మెంట్ తర్వాత బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్‌)కి ఛైర్మన్‌గానూ పనిచేసిన ప్రకాశ్ పదుకొణె.. కరోనా కారణంగా తాజాగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అతని కూతురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. 1970-80లో ప్రకాశ్ పదుకొణె అత్యుత్తమ ఆటతీరుతో భారత్‌కి చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడు. బ్యాడ్మింటన్‌ పరంగా భారత్‌కి ఆ దశాబ్దం స్వర్ణయుగంగా చెప్తుంటారు. 1980లో ఫస్ట్ ప్రకాశ్ పదుకొణె ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ గెలుపొందగా.. 2001 వరకూ ఎవరూ ఆ ఫీట్‌ని సాధించలేకపోయారు. 2001లో పుల్లెల గోపీచంద్ మళ్లీ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌ని గెలుపొందాడు. ప్రస్తుతం గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ చీఫ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రకాశ్ పదుకొణె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu

PV Sindhuకి అరుదైన గౌరవం.. ఐఓసీ అంబాసిడర్‌గా నియామకం

Image
https://ift.tt/3ukYsUq భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి మరో అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్‌లో స్ఫూర్తిని చాటుతున్న పీవీ సింధుని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపెయిన్‌కి అంబాసిడర్‌గా నియమించింది. పీవీ సింధుతో పాటు కెనాడాకి చెందిన స్టార్ షట్లర్ మిచెల్లె లీ కూడా అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఓ ప్రకటనని విడుదల చేసింది. వాస్తవానికి ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌ ‘ఇయామ్ బ్యాడ్మింటన్’ క్యాంపెయిన్‌కి గ్లోబర్ అంబాసిడర్‌గా ఉంది. ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్ నుంచి పీవీ సింధు తన స్ఫూర్తివంతమైన మాటలతో యువ షట్లర్లలో ఉత్సాహం నింపుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మరో బాధ్యతని కూడా ఆమెకి అప్పగించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపెయిన్‌కి అంబాసిడర్‌గా ఎంపికవడంపై పీవీ సింధు మాట్లాడుతూ ‘‘ఐఓసీ నన్ను అంబాసిడర్‌గా ఎంపిక చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. గేమ్‌లో ఛీటింగ్ లేదా పోటీలో అవకతవకలపై పోరాటంలో నా సహచర అథ్లెట్స్‌కి నేను అండగా నిలబడతా’’ అని వెల్లడించింది. సోషల్ మీడియా, వెబినార్ల ద్వారా యువ అథ్లెట్స్...