భారత హాకీ దిగ్గజం మృతి.. కరోనా నుంచి కోలుకున్న గంటల్లోనే
https://ift.tt/3h8Wq5N
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత హాకీ దిగ్గజం (62) శనివారం మృతి చెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్లో భారత్ జట్టు బంగారు పతకం గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన రవీంద్ర పాల్ సింగ్ ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డాడు. దాంతో.. లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన అతని కుటుంబ సభ్యులు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం వివేకానంద పోలీక్లినిక్లో చేర్చారు. అయితే.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న రవీంద్ర.. బ్రీతింగ్ ప్రాబ్లమ్తో ఈరోజు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1979లో ఇంటర్నేషనల్ కెరీర్ని ప్రారంభించిన రవీంద్ర పాల్ సింగ్.. భారత జూనియర్ జట్టుకి వరల్డ్కప్లో ఆడి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 1980 మాస్కో ఒలింపిక్స్, 1984 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆడిన రవీంద్ర.. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో భారత్కి ప్రాతినిథ్యం వహించాడు. కరాచీ వేదికగా 1980, 1983లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రవీంద్ర.. సిల్వల్ జూబ్లీ 10- నేషన్ కప్లోనూ ఆడాడు. అలానే 1982లో వరల్డ్కప్, 1982లోనే ఆసియా కప్లో భారత్కి ప్రాతినిథ్యం వహించాడు. రవీంద్ర పాల్ సింగ్ పెళ్లి చేసుకోలేదు. అతని చెల్లి కుటుంబంతోనే కలిసి ఉన్నాడు. వాస్తవానికి రవీంద్ర కరోనా నుంచి వేగంగా కోలుకున్నాడని.. కానీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సమస్య తీవ్రతరం కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా.. ఫలితం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్ర పాల్ సింగ్ మృతిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు సంతాపం తెలియజేశారు.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment