PV Sindhuకి అరుదైన గౌరవం.. ఐఓసీ అంబాసిడర్‌గా నియామకం

https://ift.tt/3ukYsUq
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి మరో అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్‌లో స్ఫూర్తిని చాటుతున్న పీవీ సింధుని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపెయిన్‌కి అంబాసిడర్‌గా నియమించింది. పీవీ సింధుతో పాటు కెనాడాకి చెందిన స్టార్ షట్లర్ మిచెల్లె లీ కూడా అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఓ ప్రకటనని విడుదల చేసింది. వాస్తవానికి ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌ ‘ఇయామ్ బ్యాడ్మింటన్’ క్యాంపెయిన్‌కి గ్లోబర్ అంబాసిడర్‌గా ఉంది. ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్ నుంచి పీవీ సింధు తన స్ఫూర్తివంతమైన మాటలతో యువ షట్లర్లలో ఉత్సాహం నింపుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మరో బాధ్యతని కూడా ఆమెకి అప్పగించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపెయిన్‌కి అంబాసిడర్‌గా ఎంపికవడంపై పీవీ సింధు మాట్లాడుతూ ‘‘ఐఓసీ నన్ను అంబాసిడర్‌గా ఎంపిక చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. గేమ్‌లో ఛీటింగ్ లేదా పోటీలో అవకతవకలపై పోరాటంలో నా సహచర అథ్లెట్స్‌కి నేను అండగా నిలబడతా’’ అని వెల్లడించింది. సోషల్ మీడియా, వెబినార్ల ద్వారా యువ అథ్లెట్స్‌కి పీవీ సింధు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.


CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu

Comments