Sushil Kumar కెమెరాకి చిక్కి.. మళ్లీ అజ్ఞాతంలోకి రెజ్లర్

https://ift.tt/3ufRVcR
మర్డర్ కేసులో ఇరుక్కున్న భారత సీనియర్ రెజ్లర్ ఆచూకీ ఎట్టకేలకి ఢిల్లీ పోలీసులకి లభించింది. ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో ఈ నెల 4న యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్.. ఆ ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాంతో.. అతని కోసం గత రెండు వారాలుగా గాలిస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఫస్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం అతనిపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అవగా.. ఆఖరిగా ఢిల్లీ పోలీసులు సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డ్ ఇస్తామని కూడా ప్రకటించారు. ఢిల్లీ పోలీసుల గాలింపు తీవ్రతరం కావడంతో.. అరెస్ట్ తప్పదని భావించిన సుశీల్ కుమార్.. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించాడు. సుశీల్‌ని ఉద్దేశపూర్వకంగానే కొంత మంది ఈ కేసులో ఇరికించారని అతని తరఫు న్యాయవాది వాదించాడు. అయితే.. ప్రభుత్వ తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ హాకీ స్టిక్‌తో సాగర్ దండక్‌ని గాయపరిచనట్లు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకి విన్నవించాడు. దాంతో.. సుశీల్‌కి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సుశీల్ కుమార్ కోసం గాలిస్తున్న పోలీసులకి ఎట్టకేలకి అతని ఆచూకీ లభ్యమైంది. మే 6న అతను మీరట్‌లోని టోల్‌ ప్లాజా వద్ద కెమెరాకి చిక్కాడు. కారులో అతను ముందు సీట్లో కూర్చుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆ దిశగా పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.


CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu

Comments