రెండు వారాలు పోలీసులకు చుక్కలు.. ఎట్టకేలకు చిక్కిన రెజ్లర్ సుశీల్ కుమార్
https://ift.tt/3fDaPoH
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న స్టార్ .. ఎట్టకేలకు పట్టుబడ్డాడు. గత 15 రోజులుగా అతడి గురించి తీవ్రంగా గాలించిన .. లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు. సుశీల్ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష నగదు రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. అతడి కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, ఎట్టకేలకు పంజాబ్లో చిక్కారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వెళుతుండగా ఓ టోల్ గేట్ వద్ద సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పంజాబ్లోని సుశీల్ స్నేహితుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని గాలింపు చేపట్టడంతో చివరకు పట్టుబడ్డారు. సుశీల్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిని ఢిల్లీకి తరలిస్తున్నారు. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ఖర్ హత్య కేసులో సుశీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ధన్ఖర్పై దాడి చేసి అతడి మృతికి కారకుడయ్యాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్ మృతి చెందినప్పటి నుంచి సుశీల్ కుమార్ పరారీలోనే ఉన్నారు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేసి.. సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపితే రూ.1 లక్ష రివార్డు ఇస్తామని ప్రకటించారు. సుశీల్ కుమార్ కారులో వెళుతుండగా మీరట్ టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటి ఆధారంగా సుశీల్ కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. అతడు పంజాబ్ దిశగా వెళ్లాడని గుర్తించారు. ఈ క్రమంలో జలంధర్ సమీపంలో సుశీల్ కుమార్తో పాటు అజయ్ కుమార్ అనే మరో అనుమానితుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. వారిద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. మే మొదటివారంలో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ఖర్ చనిపోయాడు. సాగర్ పై దాడి చేసినవారిలో సుశీల్ కుమార్ కూడా ఉన్నట్టు విచారణలో గుర్తించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుశీల్ కుమార్ మే 18న ఢిల్లీ రోహిణి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా.. న్యాయస్థానం తిరస్కరించింది. మే 4 నుంచి సుశీల్ పరారీలోనే ఉన్నారు.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment