Singapore Open రద్దు.. సైనా నెహ్వాల్, శ్రీకాంత్ ఒలింపిక్ ఆశలకి తెర

https://ift.tt/3fiijgs
భారత అగ్రశ్రేణి షట్లర్లు , కిదాంబి శ్రీకాంత్‌‌లకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించేందుకు ఆఖరి అవకాశంగా కనిపించిన సింగపూర్ ఓపెన్ కరోనా కారణంగా తాజాగా రద్దయింది. వాస్తవానికి ఈ టోర్నీని వాయిదా వేస్తారని అంతా ఊహించారు. కానీ.. సింగపూర్ ఓపెన్ కోసం కొత్త తేదీల్ని ప్రకటించేది లేదని బీడబ్ల్యూఎఫ్ స్పష్టంగా ప్రకటించేసింది. దాంతో.. సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలకి గండిపడింది. భారత్ నుంచి ఇప్పటి వరకు పీవీ సింధు, సాయి ప్రణీత్, చిరాగ్ శెట్టి- సాత్విక్ మాత్రమే ఒలింపిక్స్ అర్హత సాధించారు. జూన్ 1 నుంచి 6 వరకూ సింగపూర్ ఓపెన్ జరగాల్సి ఉండగా.. కరోనా తీవ్రత పెరగడంతో టోర్నీని రద్దు చేయక తప్పలేదు. క్రీడాకారులకి సురక్షిత వాతావరణం కల్పించడం కోసమే ఇలా రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ చెప్పుకొచ్చింది. వాస్తవానికి భారత్ వేదికగా జరగాల్సిన ఇండియా ఓపెన్ రద్దయినప్పుడే సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు సన్నగిల్లాయి. అయినప్పటికీ.. సింగపూర్ ఓపెన్‌లో సత్తాచాటడం ద్వారా మెగా టోర్నీకి అర్హత సాధించాలని ఇద్దరూ ఆశించారు. కానీ.. మొండిచేయి ఎదురైంది. వాస్తవానికి 2020లోనే టోక్యో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. కానీ.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడింది. కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ ఏడాది కూడా టోర్నీ జరగడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఈ ఏడాది ఒలింపిక్స్ సాధ్యం కాకపోతే మెగా టోర్నీ రద్దయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే..? 2024 పారిస్ ఒలింపిక్స్ వరకూ క్రీడాకారులు ఎదురు చూడాల్సిందే.


CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu

Comments