Wrestler Murder Case ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి సహకరించిన రెజ్లర్ సుశీల్ కుమార్
https://ift.tt/3hSnaIh
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత సీనియర్ రెజ్లర్ పొంతలేని సమాధానాలతో ఢిల్లీ పోలీసులకి ఇన్వెస్టిగేషన్లో చికాకు తెప్పిస్తున్నాడట. జూన్ 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో సుశీల్ కుమార్, అతని స్నేహితులు 23 ఏళ్ల రెజ్లర్ సాగర్పై దాడి చేయగా.. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. దాంతో.. దాదాపు 20 రోజులు పోలీసులకి చిక్కకుండా తప్పించుకున్న సుశీల్ కుమార్.. గత ఆదివారం మీరట్లో అరెస్టయ్యాడు. దాంతో.. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆరో రోజుల రిమాండ్ విధించారు. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పటికే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. దాడి జరిగిన తీరుపై పూర్తి అవగాహనకి వచ్చారు. అయితే.. సాగర్పై ఎందుకు దాడి చేశావు..? పారిపోయేందుకు ఎవరు సహకరించారు..? గ్యాంగ్స్టర్లు కాలా, నీరజ్తో నీకు ఉన్న సంబంధాలేంటి..? తదితర ప్రశ్నలకి సుశీల్ కుమార్ పొంతలేని సమాధానాలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని ఆధారంగా చేసుకుని మరిన్ని ప్రశ్నలు వేయాలని ప్రయత్నిస్తుంటే రెజ్లర్ మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్పై దాడిలో సుశీల్ కుమార్కి సహకరించిన అతని నలుగురు సహాయకుల్ని కూడా పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో మొదట్లో గ్యాంగ్స్టర్ కాలాతో కలిసి పనిచేసిన సుశీల్ కుమార్.. అనంతరం విభేదాలతో రావడంతో అతని శత్రువైన నీరజ్తో సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది. ఢిల్లీలోని మోడల్ టౌన్లో ఉన్న సుశీల్ కుమార్ ఇంట్లో సాగర్ అద్దెకి ఉండగా.. ఈ గొడవ మొత్తానికి కారణం ఆ ఇల్లేనని తెలుస్తోంది.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment