Sushil Kumar పాశవిక దాడి వీడియో వెలుగులోకి.. రెజ్లర్‌పై హాకీ స్టిక్‌తో

https://ift.tt/3frsuR3
భారత సీనియర్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో యువ రెజ్లర్ సాగర్‌పై సుశీల్ కుమార్ తన సహాయకులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. హాకీ, బేస్‌ బాల్ స్టిక్స్‌‌తో సాగర్‌ అతని స్నేహితుడిని సుశీల్ కుమార్‌ విచక్షణారహితంగా కొట్టడంతో.. తీవ్రంగా గాయపడిన సాగర్.. ఆసుపత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచాడు. దాంతో.. 20 రోజులు పరారీలో ఉన్న సుశీల్ కుమార్ గత ఆదివారం మీరట్‌లో ఢిల్లీ పోలీసులకి చిక్కాడు. ఆ తర్వాత మూడు రోజులకే అతని నలుగురు సహాయకులు కూడా పోలీసులకి చిక్కారు. సుశీల్ కుమార్‌ని కోర్టులో ప్రవేశపెట్టగా.. అతనికి ఆరు రోజుల రిమాండ్ విధించారు. దాంతో.. సుశీల్‌ని ఛత్రశాల స్టేడియానికి తీసుకెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ క్రమంలో సుశీల్ కుమార్ స్టేడియంలోని సీసీ టీవీ పుటేజీలను డిలీట్ చేయించినట్లు గుర్తించారు. అలానే దాడిని తన స్నేహితుడితో వీడియో తీయించడం ద్వారా.. రెజ్లింగ్ వర్గాల్లో తనంటే భయాందోళనలు కలిగించాలని సుశీల్ ఆశించినట్లు విచారణలో తేలింది. ఇక సుశీల్ సహాయకుల విచారణ ద్వారా.. అతనికి ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లతో సంబంధాలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. యువ రెజ్లర్‌ సాగర్‌ని సుశీల్ కుమార్ విచక్షణారహితంగా కొడుతున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సుశీల్ అతని సహాయకులు చుట్టూ చేరి సాగర్, అతని స్నేహితుడ్ని కొడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఈ కేసులో సుశీల్‌కి తాము ఎలాంటి సాయం చేయబోమని ఇప్పటికే భారత్ రెజ్లింగ్ సమాఖ్య స్పష్టం చేయగా.. రైల్వే శాఖలో ఉద్యోగిగా ఉన్న సుశీల్‌పై సస్పెన్షన్ వేటు కూడా పడింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుపొందిన సుశీల్ కుమార్.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందాడు.


CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu

Comments