రెజ్లర్ సుశీల్ కుమార్కి ముందస్తు బెయిల్ నిరాకరణ.. అరెస్ట్ తప్పదా..?
https://ift.tt/2S1HADM
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత సీనియర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో ఈ నెల 4న యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య జరిగింది. సుశీల్ కుమార్ హాకీ స్టిక్తో దాడి చేయడంతో గాయపడిన సాగర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాంతో.. సుశీల్ కుమార్తో పాటు అతని స్నేహితులపైనా కేసు నమోదు చేసిన పోలీసులు.. గత రెండు వారాల నుంచి అతని కోసం వెతుకుతున్నారు. దాంతో.. అరెస్ట్ తప్పదని భావించిన సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీలోని రోహిణి కోర్టులో పిటీషన్ వేశాడు. కానీ.. బెయిల్ ఇచ్చేందుకు కోర్డు నిరాకరించింది. రెజ్లర్ సాగర్ దండక్ని గాయపరిచిన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం గాలించిన పోలీసులు దొరక్కపోవడంతో.. ఫస్ట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కానీ.. సుశీల్ మాత్రం అజ్ఞాతం వీడలేదు. దాంతో.. ఆఖరిగా సుశీల్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో సుశీల్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశాడు. కానీ.. కోర్టు ఆ అభ్యర్థనని తిరస్కరించింది. సుశీల్ కారణంగా సాగర్ దండక్ గాయపడలేదని అతని తరఫున న్యాయవాది వాదించగా.. సుశీల్ హాకీ స్టిక్తో అతడ్ని కొడుతున్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకి తెలియజేశాడు. దాంతో.. సుశీల్ అరెస్ట్ తప్పేలా లేదు.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment