మర్డర్ కేసులో ఇరుక్కున్న రెజ్లర్ సుశీల్ కుమార్.. పోలీసుల గాలింపు
https://ift.tt/3h8x9sI
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
ఒలింపిక్స్లో రెండు వ్యక్తిగత మెడల్స్ గెలిచిన ఏకైక భారత అథ్లెట్గా ఉన్న రెజ్లర్ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియంలో తాజాగా రెజ్లర్ల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘర్షణ సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. అతను మిగిలిన రెజ్లర్లని ఘర్షణకి పురిగొల్పినట్లు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే.. సుశీల్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఛత్రపాల్ స్టేడియంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకి ఫస్ట్ సమాచారం అందింది. దాంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లగా.. అక్కడ స్టేడియం పరిసరాల్లో ఐదు కార్లు పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. వాటిని పరిశీలించగా.. అందులో ఒక డబుల్ బారెల్ లోడెడ్ గన్, స్కార్పియోలో గొడవకి వినియోగించే రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. ఐదు వాహనాల్ని సీజ్ చేసి.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘స్టేడియంలోకి బాధితుల్ని రెజర్లు బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడే పార్కింగ్ ఏరియాలో గొడవ జరిగింది. ఘటన జరిగిన సమయంలో రెజ్లర్ సుశీల్ కుమార్ అక్కడే ఉన్నాడు. అయితే.. ఈ మర్డర్లో అతని పాత్ర ఇంకా తేలాల్సి ఉంది’’ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment