రెజ్లర్ సుశీల్ కుమార్కి జైల్లో సపరేట్ సెల్.. జతేది గ్యాంగ్ కారణమా..?
https://ift.tt/34LqaOP
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్కి జైల్లో సపరేటు సెల్ని అధికారులు కేటాయించారు. ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో మే 4న యువ రెజ్లర్ సాగర్పై , అతని సహచరులు దాడి చేశారు. దాంతో.. తీవ్రంగా గాయపడిన సాగర్ (23) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. దాడి తర్వాత 22 రోజులు పరారీలో ఉన్న సుశీల్ని ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం అతను 9 రోజులు జ్యుడిషల్ కస్టడీలో ఉన్నాడు. ఈ మేరకు ఢిల్లీలోని మండోలి జైలుకి అతడ్ని తరలించారు. జైల్లో సుశీల్ కుమార్కి ప్రాణహాని ఉందని రెండు రోజుల క్రితం అతని లాయర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గ్యాంగ్స్టర్ జతేదికి సాగర్ సన్నిహితుడు కావడంతో జైల్లోని సుశీల్ కుమార్ని అతను ఏమైనా చేస్తాడేమో..? అని లాయర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో జైల్లో సుశీల్ కుమార్ని ఇతర ఖైదీలతో కాకుండా సపరేట్ సెల్లో ఉంచాలని లాయర్ డిమాండ్ చేశాడు. అయితే.. ఎట్టకేలకి లాయర్ ప్రయత్నాలు ఫలించాయి. సెక్యూరిటీ రీజన్స్తోనే సుశీల్ కుమార్కి సపరేట్ సెల్ కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు. ‘‘సుశీల్ కుమార్కి ఇతర ఖైదీలకి ఇచ్చే భోజనాన్నే జైల్లో ఇస్తున్నాం. అయితే.. తనకి ప్రొటీన్ ఫుడ్ని కావాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు కోర్టుకి ఇప్పటికే అతను అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు. భద్రతా కారణాలతో జైల్లోని 15వ సెల్ని సుశీల్ కుమార్కి సపరేటుగా కేటాయించాం’’ అని జైలు అధికారి ఒకరు తెలిపారు. స్పోర్ట్స్ పర్సన్ కావడంతో తనకి డైట్ ఫుడ్ ఇవ్వాలని సుశీల్ కోరుతున్నట్లు తెలుస్తోంది.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment