ఆసుపత్రిలో మళ్లీ చేరిన మిల్కాసింగ్.. ఐసీయూలో ఉంచి చికిత్స

https://ift.tt/3fP2r6B
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరాడు. ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన మిల్కాసింగ్ మే 20న కరోనా వైరస్ బారినపడ్డాడు. అయితే.. చండీగఢ్‌లోని ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండి తొలుత చికిత్స తీసుకున్న 91 ఏళ్ల మిల్కాసింగ్.. వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజులకే మొహాలిలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్న ఈ ఫ్లయింగ్ సిఖ్.. గత ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినప్పటికీ.. వైద్యుల సూచనల మేరకు ఆక్సిజన్ సాయం తీసుకుంటూ ఉన్నాడు. కానీ.. గురువారం అనూహ్యంగా మిల్కాసింగ్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా కనిపించడంతో వెంటనే ఐసీయూకి తరలించిన వైద్యులు.. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మిల్కాసింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మిల్కాసింగ్ అప్పట్లో గుర్తింపు పొందారు. 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో అంచనాలకి మించి రాణించిన స్వర్ణం గెలిచారు. 1956, 1960, 1964 ఒలిపిక్స్‌లోనూ భారత్‌కి మిల్కాసింగ్ ప్రాతినిథ్యం వహించాడు. భారత ప్రభుత్వం ఈ దిగ్గజ అథ్లెట్‌ని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్ చేరిన మిల్కాసింగ్.. నాలుగో స్థానంలో నిలిచారు. కేవలం 0.1 సెక్లన తేడాతో పతకం చేజార్చుకున్నారు. కానీ ఒలింపిక్స్‌‌లో ఫైనల్‌కి చేరిన తొలి భారత పురుష అథ్లెట్‌గా అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేశారు.


CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu

Comments