దిగ్గజ బాక్సర్ డింకో సింగ్ మృతి.. ఆ అలవాటుతో గాడితప్పిన కెరీర్
https://ift.tt/3gsRruH
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత దిగ్గజ బాక్సర్ (42) అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొన్నేళ్లుగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న డింకో సింగ్.. ఇటీవల కామెర్లు రావడంతో తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మణిపూర్లో కన్నుమూశాడు. బ్యాంకాక్లో 1998లో జరిగిన ఆసియా క్రీడల్లో ఒలింపిక్స్ విజేతల్ని వరుసగా ఓడించిన డింకో సింగ్ భారత్కి స్వర్ణ పతకాన్ని అందించాడు. ఆసియా క్రీడల్లో డింకో సింగ్ రింగ్లో కదిలిన తీరు, విసిరిన పంచ్లు ఎంతో మంది బాక్సర్లకి స్ఫూర్తినిచ్చింది. కానీ.. ఆ తర్వాత డింకో సింగ్ మద్యానికి బానిసవగా.. క్రమంగా అతని కెరీర్ కూడా గాడి తప్పింది. ఇంఫాల్లో పుట్టిన డింకో సింగ్.. 10 ఏళ్ల వయసులోనే సబ్ జూనియర్ విభాగంలో నేషనల్ ఛాంపియన్గా నిలిచాడు. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో ఒలింపిక్స్ విజేతల్ని సైతం మట్టికరిపించిన డింకో సింగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. కానీ.. ఆ క్రేజ్ని డింకో సింగ్ కాపాడుకోలేకపోయాడు. మద్యం అలవాటు చేసుకున్న డింకో సింగ్.. 2000లో జరిగిన ఒలింపిక్స్, 2002లో జరిగిన కామెన్వెల్త్ క్రీడల్లో కనీసం ఫస్ట్ రౌండ్ని కూడా దాటలేకపోయాడు. 1998లో డింకో సింగ్ని అర్జున అవార్డు వరించింది. ఆ తర్వాత 2013లో పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. ఇంఫాల్లో భారత క్రీడా ప్రాధికార సంస్థ కోచ్గా పనిచేసిన డింకో సింగ్ కాలేయ క్యాన్సర్తో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. గత ఏడాది కూడా రేడియోషన్ థెరపీ కోసం లాక్డౌన్ సమయంలో అత్యవసరంగా ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించాల్సి వచ్చింది. అయితే.. అక్కడ ఆసుపత్రిలో థెరపీ తీసుకుంటూ డింకో సింగ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. ఆ తర్వాత చికిత్స తీసుకుని కరోనా వైరస్ నుంచి బయటపడినా.. వెంటనే కామెర్లు వచ్చాయి. డింకో సింగ్ మృతిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, దిగ్గజ బాక్సర్లు మేరీకోమ్, విజేందర్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment