జైల్లోని రెజ్లర్ సుశీల్ కుమార్కి ఆ గ్యాంగ్తో ప్రాణహాని: లాయర్ కొత్త వాదన
https://ift.tt/3wSuQ1h
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
భారత సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్కి జైల్లో జతేది గ్యాంగ్తో ప్రాణహాని ఉందని అతని లాయర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో యువ రెజ్లర్ సాగర్ (23)పై , అతని సహచరులు దాడి చేయగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందాడు. దాంతో.. 22 రోజులు పోలీసులకి దొరక్కుండా పరారీలో ఉన్న సుశీల్.. ఎట్టకేలకి మీరట్లో అరెస్టయ్యాడు. జైల్లో ఉన్న సుశీల్ కుమార్కి జతేది గ్యాంగ్తో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన అతని లాయర్.. సుశీల్కి సపరేటు సెల్ కేటాయించాలని డిమాండ్ చేశాడు. సుశీల్ అజయ్ ఫ్రెండ్స్కాగా.. అజయ్ గర్ల్ఫ్రెండ్తో సాగర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో సుశీల్ ఇంట్లోనే సాగర్ అద్దెకి ఉండేవాడు. దాంతో.. సాగర్కి వార్నింగ్ ఇచ్చిన సుశీల్.. ఇల్లు ఖాళీ చేయించాడు. దాంతో.. సాగర్ నేరుగా జతేది గ్యాంగ్ని సంప్రదించగా.. గొడవ ముదిరింది. ఈ క్రమంలో సాగర్పై దాడి చేసిన సుశీల్.. అతని మృతికి కారణమయ్యాడు. జైల్లో ఉన్న సుశీల్ కుమార్ని చంపేందుకు జతేది గ్యాంగ్ కుట్ర చేస్తోందని ఆరోపించిన సుశీల్ లాయర్.. ఇతర ఖైదీలతో కాకుండా సపరేటుగా అతనికి సెల్ని కేటాయించాలని డిమాండ్ చేశాడు. పోలీసుల విచారణలోనూ సుశీల్ కుమార్ మరో గ్యాంగ్ని సంప్రదించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. దాంతో.. ఇప్పుడు రెండు గ్యాంగ్ల మధ్య సుశీల్ ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. జైల్లో సాధారణ ఖైదీలా ఉన్న సుశీల్.. తనకి డైట్ ఫుడ్ని ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.
CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu
Comments
Post a Comment